CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తీరనున్న పోడు గోడు. మండల వ్యప్తంగా అటవీ భూములలో మొదలైన సర్వే

Share it:



  •  తీరనున్న పోడు గోడు.
  • మండల వ్యప్తంగా అటవీ భూములలో మొదలైన సర్వే
  • పద్మాపూరం పోడు భూముల సర్వేలో పాల్గొన్న మండల కోప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా

మన్యం న్యూస్ కరకగూడెం:సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరవతో పోడు గోడు త్వరలో తీరనుంది.మండల ముమ్మరంగా కోనసాగుతున్న పోడు భూములు సర్వే కార్యక్రమం మండలకెంద్రంలోని గొల్లగూడెం,కొత్తగూడెం, చోప్పాల,పద్మపూరం బర్లగూడెం శ్రీరంగపూరం తదితర గ్రామలలో పోడు భూముల సర్వేలు ఫారేస్టు బీట్ అదికారులు,గ్రామపంచాయతి సెక్రెటరీ లు పాల్గొని సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా కరకగూడెం మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందుపాషా  మండలంలోని పద్మాపురం  గ్రామ పరిధిలోగల పోడు భూముల సర్వేలో పాల్గొని మాట్లాడుతూ అటవీ హక్కుల పరిరక్షణ కమిటీల (ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి పోడు భూముల వద్దకు వెళ్లి నిబంధనలకు అనుగుణంగా ఉన్న భూ ములను గుర్తించేందుకు అధికారులు శ్రమిస్తున్నారని అన్నారు. మండలంలో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు కార్యాచరణలను రూపొందించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా

పోడు హక్కుపత్రాలు,

పోడు భూముల హద్దులు, సర్వే నెంబర్లు,అర్హుల వివరాలు పక్కాగా తేల్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారని ఇందులో భాగంగా ప్రభుత్వ ఫీల్డ్‌ ఏరియా మేజర్‌ అనే కొత్త యాప్‌ను రూపొందించిందని తెలిపారు.పోడు భూములను సర్వే చేసే,పోడు భూముల కోసం చేసిన దరఖాస్తులను పరిశీలించే సంబంధిత శాఖల అధికారులు తమ మొబైళ్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే ఆదేశాలు జారీ అయ్యాయని పంచాయతీ కార్యదర్శులతో పాటు అటవీశాఖ సిబ్బంది గ్రామాల వారీగా  దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఈ సర్వే కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎర్రయ్య,పంచాయతీ కార్యదర్శి మణికిరణ్,గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన సర్వేలో  బీట్ అధికారి రాంబాబు సెక్రటరీ శ్రీనాద్  ఎఫ్‌ఆర్‌సీ కమిటీ అధ్యక్షులు సూతరి.నాగేశ్వరరావు,ఇర్ప.నాగేశ్వరరావు,సభ్యులు, ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ సిబ్బంది,పోడు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: