CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య...

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ : అప్పులు బాధ తట్టుకోలేక ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మద్దుకూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శీలం రవి (27) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో సతమతమవుతున్నాడు. తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి  భార్య శ్యామల, కుమారుడు, కుమార్తె కలరు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Share it:

TELANGANA

Post A Comment: