CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సర్వేకు అందరూ సహకరించాలి.. : తహసిల్దార్ వర్స రవికుమార్..

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ: పోడు సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని మండల తహసిల్దార్ వర్స రవికుమార్ సూచించారు. మంగళవారం  మద్దుకూరు, బెండాలపాడు  గ్రామాలలో జరిగిన పోడు సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోడు రికార్డులను పరిశీలించి, పోడుదారుల ఆధారాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో ఏండ్లుగా ఉన్న పోడు సమస్య  పరిష్కారం కోసం ప్రభుత్వం పోడు సర్వేను ప్రారంభించిందని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయపక్షాలు, పోడుదారులు, రైతులు సహకరించాలన్నారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుదారులందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సర్వే పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజర్ శ్రీనివాసరావు, మండల పంచాయతీ అభివృద్ధి అధికారి తులసీరామ్, పంచాయతీ కార్యదర్శులు సతీష్, సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, రెవిన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: