మన్యం న్యూస్, కరకగూడెం:
దేశంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరుతుంటె ఒక పక్క బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలను బి(టి)ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తిప్పికొట్టడం జరిగినదని బి(టి)ఆర్ఎస్ పార్టీ ని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని బి(టి)ఆర్ఎస్ పార్టీ ఎంపీపీ రేగా కాళికా,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ అన్నారు.బి(టి)ఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కరకగూడెం అంబేద్కర్ సెంటర్ వరకు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను శవ యాత్ర చేసి ప్రధాన కూడలిలో మోడీ దిష్టి బొమ్మ ను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి(టి)ఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బిజెపి పార్టీ చెస్తున్న ప్రలోభాలకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం చెయ్యడం జరిగినదని అన్నారు.ఒక్కొక్క ఎమ్మెల్యే కి 100కొట్లు ఇచ్చి కొనుగోలు వెయ్యాలని బిజెపి పార్టీ వాళ్లు చూడటం విడ్డురంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,మండల ప్రదాన కార్యదర్శి బుడగం.రాము,కో ఆప్షన్ సభ్యులు సొందుపాషా,నాయకులు రేగా.సత్యనారాయణ,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,యుత్ నాయకులు గుడ్ల.రంజీత్ కుమార్, కటకం.లెలిన్,కటుక్వజుల. దిలీప్, వేణు,గుమ్మడివెల్లి.ప్రసాద్,కరకగూడెం ఉపసర్పంచ్ రావుల.రవి,గాందెర్ల.సత్తిష్,చిట్టిమల్ల.ప్రవీణ్,రామటెంకి.పూర్ణచెంద్రశేఖర్,చిట్టి.సత్తిష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: