మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వరావుపేట మండలం, వేదాంతపురం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో వేంచేసియున్న శ్రీ వనదుర్గంబిక సమేత వన లింగేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో నవంబర్ ఆరవ తేదీ అనగా రెండవ ఆదివారం నాడు వనంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహణ ఉండగా ట్రస్ట్ సభ్యులు మరియు వేదాంతపురం గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు గ్రామస్తులు దానికి సంబంధించిన పోస్టర్ను గురువారం అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరావు స్వగృహంలో తాటిసుబ్బన్నగూడెంలో ఎమ్మెల్యే మెచ్చా ద్వారా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా వేదాంతపురం సర్పంచ్ సోమని శివప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసంలో రెండవ ఆదివారం నాడు వేదాంతపురం గ్రామ శివారులో వనదుర్గాంబిక ఆలయం వద్ద జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులందరూ ఆహ్వానితులేనని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Navigation
Post A Comment: