మన్యం న్యూస్, మంగపేట. :
భారత దేశ సమైక్యత కోసం, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర విజయవంతం చేయాలని ఆల్ ఇండియా మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశించారు, ఈ మేరకు, జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గ్రామ స్థాయి నుండి జోడో యాత్ర యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనీ ప్రతి గ్రామంలో జోడో యాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ చేయాలని సూచించారు, సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు కుమారస్వామి సూచనల మేరకు గురువారం చెరుపల్లి గ్రామంలో గ్రామ అధ్యక్షులు పోకల శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారత్ జూడో యాత్ర విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పోకల శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపిటిసి చిలకమర్రి శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,కిసాన్ సెల్ కార్యదర్శి దిద్ది లక్ష్మీ నరసయ్య, మండల యూత్ సెక్రెటరీ చిట్టి పెళ్లి ముకుంద, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు బేత శ్రీనివాస్, సీనియర్ నాయకులు పూజారి వెంకన్న, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, ముత్తినేని వెంకటేశ్వర్లు,పూజారి నరేందర్,కట్ల కొండయ్య, పనగంటి అర్జున్, పాయం చిన్ని, కారం సంతోష్, కొమరోజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: