జూలూరుపాడు, అక్టోబర్ 3, (మన్యం న్యూస్ ప్రతినిధి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ, పుట్టకోట గ్రామానికి చెందిన గరిడేపల్లి తిరుపతయ్య తాపీ మేస్త్రి గా పనిచేస్తున్నారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతుండగా, జూలూరుపాడు మండల భవన నిర్మాణ కార్మికసంఘం (ఏఐటీయూసీ) మండల అధ్యక్షుడు సిలివేరి నరసింహారావు, పండు మేస్త్రి, ఉపాధ్యక్షులు పురేటి సత్యనారాయణ, తోటి కార్మికులతో కలిసి సోమవారం తిరుపతయ్య ను పరామర్శించి, వారి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే కరీముల్లా, గుడిమెట్ల సీతయ్య, బలుగూరి నరసింహారావు, కృష్ణ, గరిడేపల్లి రమేష్, బలుగూరి ముత్తయ్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: