జూలూరుపాడు, అక్టోబర్ 3, (మన్యం న్యూస్ ప్రతినిధి) : ఈనెల 14న విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో మహాసభల వాల్ పోస్టర్ ను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ, దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, దేశ సంపదను కార్పొరేట్ సంస్థల కు అప్పచెప్పి వారికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఈ మహాసభకు 14వ తేదీన లక్షలాది మందితో విజయవాడలో భారీ ర్యాలీ జరుగుతుందని, ఈ జాతీయ మహాసభలకు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభకు భారీ స్థాయిలో ప్రజలు, ప్రజా స్వామ్యవాదులు, పార్టీ శ్రేణులు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లంకి మధు, షేక్ నాగుల్ మీరా, చింత స్వరాజ్యరావు, గార్లపాటి వీరభద్రం, ఎస్.కె చాంద్ పాషా, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, తూము కోటయ్య, వలమల్ల సామేలు, చిమట ముత్తయ్య, బెజవాడ సీతయ్య, చలమల నరసింహారావు, గూగులోత్ కిరియా, కొండా వీరయ్య, బరగడ రమేష్, దేవినేని రాము, బడుగు వీరస్వామి, దర్శనాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: