మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం అటవీ క్షేత్రాధికారి తేజస్వి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ లో వన్య ప్రాణుల సంరక్షణ చట్టాల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ చవళం అరుణ, బీట్ ఆఫీసర్లు లక్ష్మణ్, రంగన్న, వెంకటేశ్వర్లు, ఆదిత్య రాంబాబు, గోవర్ధన్, రాణి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: