మన్యం న్యూస్, అక్టోబర్ 13 , వెంకటాపురం :
అడవులే అడ్డాగా చేసుకొని నాటు సారా తయారీ చేస్తున్నారని విశ్వాసనీయవర్గాల సమాచారం మేరకు, ఎక్సైజ్ ఎస్సై అశోక్, తయారీ కేంద్రాలపై దాడి చేశారు. ఎక్సైజ్ పోలీసుల వివరాల ప్రకారం వెంకటాపురం మండలం మల్లాపూర్, రాచు పల్లి, కోయబేస్తా గూడెం, గ్రామ పరిసరాల అటవీ ప్రాంతంలో వాగు ఒడ్డున ఇప్పపువ్వు, బెల్లం, సుమారు 40 ప్లాస్టిక్ డ్రంబులలో పులియ పెట్టారు. పులియబెట్టిన బెల్లం పానకం మూడు వేల లీటర్ల సారా తయారీ డ్రమ్ములను ధ్వంసం చేశారు. తయారీ కేంద్రాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: