మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ:
మండల పరిధిలోని తుంగారం పంచాయతీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో, నలుగురు అనర్హులు ఇళ్లను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారిపై చర్యలు తీసుకుని వెంటనే వారిని తొలగించి, జాబితాలో ఉన్న అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు తహసీల్దారు వర్స రవికుమార్ ని కోరారు. గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ తో లబ్ధిదారులు వాగ్వాదానికి దిగి మాకు కేటాయించిన మాకు ఇల్లు ఇప్పించమని వినతిపత్రం సమర్పించారు.ఆక్రమణదారులపై స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని, త్వరలో ఆక్రమణలు తొలగించి నిజమైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, తహసిల్దార్ వారికి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Post A Comment: