CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆధార్ నవీకరణ తప్పనిసరి జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

Share it:


మన్యం న్యూస్, ములుగు :


2015 సంవత్సరం కన్నా ముందు ఆధార్ పొందిన వారు నవీకరణ తప్పనిసరి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.

శుక్రవారం  జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్ కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆధార్ నవీకరణ   అవగాహన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ప్రభుత్వ పథకానికైనా ఉద్యోగ దరఖాస్తు,  ప్రభుత్వ పథకాల అమలు, లబ్దిదారులు ఎంపిక, బ్యాంకులో ఖాతాలు తెరిచేందుకు,కుల,ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాలకు, స్థలాల రిజిస్ట్రేషన్లకు, సిమ్ కార్డుకు, రేషన్ కార్డులకు, స్కాలర్షిప్ పొందుటకు ఇలా అన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. 2015 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ యు ఐ డి ఏ ఐ (UIDAI) ఆదేశాల మేరకు తగిన గుర్తింపు పత్రంతో స్థానికతను మరోసారి నవీకరించుకోవాలని కలెక్టర్  కోరారు.ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు,పునరుదించుకోవాలని కలెక్టర్ అన్నారు. (UIDAI)ఆదేశాలు మేరకు అన్ని ఆధార్ నమోదు కేంద్రాల్లో కేటాయించిన రుసుముతో సేవలను పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయభాస్కర్,డిపిఆర్ఓ రఫిక్,ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ సమాజి  దేవేందర్,మీసేవ మేనేజర్  విజయ్, కలెక్టరేట్ సిబ్బంది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: