మన్యం న్యూస్, అక్టోబర్ 28, వాజేడు. :
తెలంగాణ రైతు సంఘం వాజేడు మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వాజేడు మండల విద్యుత్ ఉప కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు చిట్టెం ఆదినారాయణ మాట్లాడుతూ వాజేడు ధర్మారం సబ్స్టేషన్ పరిధిలో వ్యవసాయ విద్యుత్ సరఫరా సక్రమంగా రానందువలన రైతులు పండించే పంటలు వరి, మిర్చి, జొన్న, మినుములు, పెసలు, మొదలగు పంటలకు నీటి సౌకర్యం లేక ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వాజేడు ధర్మారం సబ్ స్టేషన్ల పరిధిలోని త్రీఫేస్ లైన్ కు 24 గంటలు విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయవలసిందిగా అధికారులను కోరారు. లేనిపక్షంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరినీ ఏకం చేసి విద్యుత్ శాఖ కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు తాటి బాబురావు, కార్యదర్శి కొప్పుల చొక్కా రావు,రైతు సంఘం వెంకటాపురం మండలం అధ్యక్షులు కంటెం సత్యం,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య, దామోదర్, వాదం పోతురాజు, ఆనందరావు, కారం భూలక్ష్మి, బద్ది ఆదినారాయణ,పూనమ్ వీరస్వామి, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: