మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి, అక్టోబర్ 28 : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం అన్నపురెడ్డిపల్లి మండలం ఎంపీపీ సున్నం లిలిత ఆధ్వర్యంలో ప్రధాన రహదారి సెంటర్లో గల పర్సా వారి కాంప్లెక్స్ నందు కేకును కట్ చేసి కార్యకర్తలకు పండ్లు,మిఠాయిలు, పంపిణీ చేశారు. కేక్ కటింగ్ అనంతరం ఎంపీపీ సున్నం లలిత మాట్లాడుతూ టిఆర్ఎస్ (బిఆర్ఎస్)పార్టీ అభివృద్ధి లక్ష్యం కొరకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి సర్పంచ్ బోడా పద్మ, వైస్ సర్పంచ్ పర్సా వెంకటేశ్వరరావు , టిఆర్ఎస్( బిఆర్ఎస్) గ్రామ అధ్యక్షుడు మరిదు వేణు, , తోట్టిపంపు సర్పంచ్ సున్నం చిరంజీవి , మండల టిఆర్ఎస్ నాయకులు బోల్లికొండ సత్యం, వీరబోయిన నాగేశ్వరరావు, గాలం కాటంరాజు, గుజ్జా పూర్ణచంద్రరావు, పరంకుశ రాజా, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: