జూలూరుపాడు, అక్టోబర్ 28, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ శుక్రవారం జూలూరుపాడు మండల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలోని అనంతారం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించగా తరగతి గదులన్నీ తాళాలేసి దర్శనం ఇవ్వడంతో అవాక్కయ్యారు. ఆ పాఠశాల నందు పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాల ముగింపు సమయం పూర్తి కాకముందే పాఠశాలను మూసివేసినట్లు గుర్తించారు. సదరు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఒక రోజు జీతము నిలిపివేయాలని ఆదేశించినట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకట్ తెలిపారు.
Navigation
Post A Comment: