CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమానులు

Share it:


మన్యం న్యూస్, అక్టోబర్ 28 :

దమ్మపేట మండలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా పొంగులేటి అనుచరులు పర్వతనేని  ప్రసాద్, నర్సి, రాధాకృష్ణ, రవిశంకర్ పండు, గోపి శాస్త్రి, నాగభూషణం తదితర వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటగా దమ్మపేట మెయిన్ రోడ్డు కాపుల బజార్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుండి మందలపల్లి సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరిట అర్చన చేయించారు. అనంతరం మందలపల్లి సెంటర్లో భారీ కేకును కట్ చేశారు. అనంతరం దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో వీరందరూ పాల్గొనటమే కాకుండా వీరితోపాటు పొంగులేటి అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి అక్కడికి వచ్చిన పొంగులేటి అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజన సదుపాయాన్ని  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు , పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: