మన్యం న్యూస్, అక్టోబర్ 28, వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామపంచాయతీలో జరిగిన పీసా గ్రామసభ లో మూడోవ ఇసుక సొసైటీ ఏర్పాటు కోసం పూసూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ భోదెబోయిన సరళ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ లో మొత్తం 150, సభ్యులు కాగా 140, మంది సభ్యులు హాజరయ్యారు అని గ్రామ సభ అధికారి వాజేడు మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్ నాయుడు తెలిపారు. పూసూరు గ్రామపంచాయతీలో ప్రస్తుతం రెండు ఇసుక సొసైటీలు ఉన్నాయని మూడవ సొసైటీ ఈ గ్రామానికి అవసరమా లేదా అనేది సంబంధిత అధికారి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలనుసారం ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు ఎంపీ ఓ, తెలిపారు మూడవ సొసైటీ కావాలని దరఖాస్తు చేసుకున్నందునా గ్రామ సభ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు అని తెలిపారు మూడవ సొసైటీ పేరు నూక మాంబిక, గిరిజన ఇసుక సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మూడవ ఇసుక సొసైటీ మీ అందరికీ ఆమోదమేనా అని అడగగా అందరూ ఏకగ్రీవంగా చేతులెత్తి తమ అభిప్రాయాన్ని తెలియజేసారు దీంతో అధికారులు గ్రామసభ ఏకగ్రీవం అయినట్లు తీర్మానించారు.
Post A Comment: