జూలూరుపాడు, అక్టోబర్ 28, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల అధ్యక్షులు కడియాల పుల్లయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవంబర్ 22 న జరగబోయే బహిరంగ సభకు జన సమీకరణ గురించి సమావేశంలో చర్చించడం జరిగింది. మండల కేంద్రం నుండి బహిరంగ సభకు నాయి బ్రాహ్మణులంతా భారీగా కదిలి రావాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాడుగుల నాగరాజు, కడియాల మణికుమార్, మండల గౌరవ అధ్యక్షుడు కడియాల ఆనందరావు, ముద్దు నూరి బుచ్చిబాబు, కడియాల నరేష్, మాడుగుల నరేష్, కడియాల నాగేశ్వరరావు, కడియాల శ్రీనివాసరావు, శేషాద్రి, మధు, వల్లోజి నాగరాజు, కడియాల హరీష్, కడియాల ప్రేమ్, పెద్దారపు కృష్ణారావు, కడియాల హరికృష్ణ, మార్కాపురి నరసింహారావు, ఓగిరాల దుర్గారావు, కడియాల సత్యనారాయణ, వల్లోజి లతీఫ్, ఉప్పర్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: