CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు అక్షరాలపై అవగాహన కల్పించండి.. ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం... మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక పర్యటన..

Share it:


 విద్యార్థులకు అక్షరాలపై అవగాహన కల్పించండి..

* ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం...

* మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక పర్యటన..


 మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ అక్టోబర్ 20: విద్యార్థులకు కనీసం అక్షరాలపై అవగాహన నేర్పించాలని, వర్ణమాల రాకుండా చదువు ఎలా చెబుతున్నారని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉపాధ్యాయురాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పర్యటనలో భాగంగా దామరచర్ల పాఠశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి  విద్యార్థులను తరగతుల వారీగా వారి స్థాయిలను బట్టి సామర్ధ్యాలను స్వయంగా పరీక్షించారు. బోర్డుపై లెక్కలు, సరళ పదాలను రాయించి  చదివించారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయురాలు నీలావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం రాయటం,చదవటం 

 రాకపోతే ఎలా అని, తొలిమెట్టు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్, అంగన్వాడీలో చదువు చెప్పలేదు అనే విషయాలు చెప్పేందుకు ప్రయత్నించగా కలెక్టర్ ఆగ్రహంతో సాకులు చెప్పవద్దని హెచ్చరించారు. మరో 15 రోజుల్లో మళ్లీ వస్తానని ఈసారి విద్యార్థులకు చదవడం, రాయడం రాకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రధానోపాధ్యాయులు సైతం  బాధ్యత తీసుకోవాలని హెచ్ఎం శ్రీరాములను ఆదేశించారు.ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: