జూలూరుపాడు, అక్టోబర్ 20, (మన్యం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ
అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖర్గే నియామకం పట్ల జూలూరుపాడు మండల కాంగ్రెస్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. గురువారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. మండలలోని సీనియర్ నాయకుల నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతనమై రానున్న నియోజకవర్గ పురోభివృద్ధికి నిరంతరం శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొని హర్షం వ్యక్తంచేస్తూ,
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమతెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు బొడ్డు కృష్ణయ్య, మాజీ మండల అధ్యక్షులు ముత్తినేని రామయ్య, లకావత్ లచ్చునాయక్, చాపలమడుగు నరసింహారావు, మంద బాబు, తాళ్లూరి అచ్చయ్య, సాయి, అజయ్ తేజ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: