CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్ కి వినతి పత్రం.. పెసా గ్రామ కమిటీ కార్యదర్శి కట్రం ప్రసాద్..

Share it:

 


జూలూరుపాడు, అక్టోబర్ 20, (మన్యం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం రెవిన్యూ గ్రామపంచాయితీలో జరుగుతున్న అక్రమ మట్టితోలకాల పై చర్యలు తీసుకోవాలంటూ గురువారం పడమట నర్సాపురం పెసా కమిటీ గ్రామ కార్యదర్శి కట్రం ప్రసాద్ స్థానిక తహశీల్దార్ లూధర్ విల్సన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా గ్రామ రెవెన్యూ పరిధిలోని  సర్వే నెంబర్ 162/1 లో నిరుపేద ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్మెంట్ భూములలో వారికి డబ్బులు ఏరచూపి వారి పేరు మీద పర్మిషన్ తీసుకొని బడా కాంట్రాక్టర్లు కొందరు అక్రమంగా, ఇచ్చలవిడిగా మట్టి తోలకాలు జరుపుటకు తయారు అవుతున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అమలులో ఉన్నప్పటికీ సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి పెసా తీర్మానాలను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, ఆదివాసి చట్టాలను అవహేళన చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం 161/1/పి లో జరిగిన  అక్రమ మట్టితోలకాల అక్రమాన్ని మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించి  గ్రామానికి చెందిన ఒక ఆదివాసి గిరిజన రైతుకు అక్షరాల 43,00,700/- రూపాయల జరిమానా విధించి చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ మట్టి తోలకాల వలన పరిసర ప్రాంత పంట పొలాలన్నీ దెబ్బతిని రైతులకు నష్టం కలుగుతుందని అన్నారు. ఈ విషయంపై ఐటీడీఏ పిఓ భద్రాచలం గారికి వినతి పత్రం అందించామని, జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. కావున స్థానిక తహశీల్దార్ పర్మిషన్ క్యాన్సిల్ చేసి, సంబంధిత శాఖలకు నిలుపుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసి, తమకు న్యాయం చేసి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: