CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు గుర్తించిన సామాజిక తనిఖీ బృందం

Share it:

 


 👉 ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు గుర్తించిన సామాజిక తనిఖీ బృందం 

 👉 కాసుల కక్కుర్తి కోసం మైనర్లకు, చనిపోయిన  వారి పేర్ల మీద జాబ్ కార్డు లు మంజూరు చేసి డబ్బులు డ్రా చేసిన అధికారులు

మన్యం న్యూస్ :ములకలపల్లి:(అక్టోంబర్ 19):మండలం లో వారం రోజుల గా గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించారు.జగన్నాధపురం, నరసాపురం, తొగూడెం,చింత పేట, రేగులకుంట,చండ్ర కుంట,రాజాపురం, ఎస్సీ కాలనీల్లో, అనేక అక్రమాలు జరిగినట్లు జగన్నాధపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభల్లో ఆడిట్ అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారి పేరుతో పనులు మంజూరు చేసి కూలీల డబ్బులు డ్రా చేసినట్లు 18 సంవత్సరాలు నిండని వారి కి జాబ్ కార్డులు మంజూరు చేసి నట్లు అధికారులు వెల్లడించారు. చెరువులు కుంటలు సంబంధించిన పనులు జరగకుండానే బిల్లులు డ్రా చేశారని,రైతులు నిర్మించుకో వలసిన రైతు కల్లాలు దళారులకు అప్పగించి నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చినట్లు, రైతు కలాలు స్వయంగా  రైతే నిర్మించు కోవాల్సి ఉండగా టెక్నికల్ అసిస్టెంట్ స్వరూపరాణి కాసులకు కక్కుర్తిపడి దళారులకు అప్పగించారని రైతులు ఆరోపిస్తున్నారు.జీడిమామిడి టేకు మొక్కలు రైతుల భూముల్లో వేయకుండానే వాటి సంరక్షణ కోసం మంజూరైన డబ్బులను ఎప్పుడూ పని కి వెళ్లని వారి అకౌంట్ లోకి డబ్బులు మళ్లించారని ఆడిట్ అధికారులు వెల్లడించారు.ఈ అక్రమాలు జరగడానికి ముఖ్య కారకులైన ఉపాధి అధికారులు మేట్లు పై చర్యలు తీసుకొని ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామపంచాయతీ లొ జరిగిన గ్రామ సభకు వచ్చిన ఉపాధి హామీ లోని పనిచేసిన కూలీలు ఆరోపిస్తున్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు. సర్పంచ్ గడ్డం భవాని, కోఆప్షన్ సభ్యులు జబ్బార్, లక్ష్మణ్,సురబి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: