మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (19) మండలం పరిధిలోని కాచనపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అదృశ్యంపై నోరు మీద పని పాఠశాల సిబ్బంది. దమ్మపేట ఆశ్రమ పాఠశాలలో లైంగిక వేధింపులకు గురై బాల సంరక్షక్ వారి ద్వారా కాచనాపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని చేర్పించారు ఆ విద్యార్థి బుధవారం కనిపించకపోవడంతో విద్యార్థులు సమాచారం ఇవ్వడం వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై విద్యార్థి సంఘాలు ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాలు ఆశ్రమ పాఠశాలకు చేరుకునే లోపే పాఠశాల హెచ్ఎం, వార్డెన్ అందుబాటులో లేకుండా పోయారు. వారిని వివరణ కోరుదామని ప్రయత్నించిన వారు స్పందించ లేదు. ఇది ఇలా ఉండగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థి తల్లికి అప్పజెప్పినట్టు తప్పుడు లెటర్ ను సృష్టించి ఆ లెటర్లో తల్లి సంతకం చేసి తల్లికి అప్పజెప్పినట్టు మీడియా, విద్యార్థి సంఘాలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. విద్యార్థి ఆచూకీ తెలవకపోవడంతో తీరిగ్గా ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిబ్బంది చేరుకున్నారు. విద్యార్థి అదృష్టానికి కారకమైన పట్టించుకోని పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి
Navigation
Post A Comment: