మన్యం న్యూస్, కరకగూడెం: రైతులు పంటలలో వచ్చే తెగుళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు అన్నారు. బుధవారం కరకగూడెం మండలం సమత బట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో అభిమన్యుడు, పినపాక మండలం జానంపేట రెవెన్యూ పరిధిలోని అమరారం గ్రామంలో మణుగూరు వ్యవసాయ సహాయ సంచాలకులు తాతారావు రైతుల వ్యవసాయ క్షేత్రాలలో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు.అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు మాట్లాడుతూ రైతులు అందరు తప్పనిసరిగా పంటలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు.ఎల్లపుడు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని, పంటలకు చీడపీడలు సోకితే అధికారుల సలహాలు తీసుకొని,సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. పంటపొలాల నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులందరూ త్వరగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. పంటల నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికంగా ఎరువులు మండలానికి అందే అవకాశం ఉందని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ పథకాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ,రైతుల పంటల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాల్సిందిగా అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంట కరకగూడెం మండల ఏఈవో లు ప్రశాంత్,అనిల్ కుమార్ రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: