మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో మరోసారి పోడు భూమి వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన పోడు సాగు దారులు గతంలో అందరం కలిసి పోడు భూమి సాగు చేసుకున్నాం ఆరోజు సిపిఎం పార్టీ నాయకులు ఫారెస్ట్ అధికారులు కలిసి మమ్మల్నందర్నీ పోడు భూములు లోకి వద్దంటూ అందరికి కలిసి సమన్యాయంగా న్యాయం చేస్తా మనీ హామీ ఇచ్చారు, చిలకల గండి ముత్యాలమ్మ ఆలయం వెనక మా పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ వేసి మొక్కలు నాటారని ముత్యాలమ్మ ఆలయం ముందు మీకందరికీ పోడు భూములు ఇస్తామని నమ్మబలికి మమ్మల్ని మోసం చేశారంటూ ఈరోజు పోడు భూమిలో సర్వే జరుగుతుండగా పోడు సాగు దారులు సర్వే అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ పోడు భూముల్లో కొంతమంది గిరిజనులు గిరిజనేతరులకు పోడు భూములు అమ్ముకున్నారని వారి అండదండలతోనే అధికారులకు సర్వే చేయొద్దని చెప్పిన కూడా వినకుండా సర్వే చేస్తున్నారని ఆందోళన చేశారు మా సమస్యను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి కూడా తీసుకెళ్లామని ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఇకనైనా ప్రజా ప్రతినిధులు గాని అధికారులు కానీ మాకు న్యాయం చేయాలని మాకు న్యాయం జరిగే వరకు ఈ సర్వే జరగనీయకుండా అడ్డుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.
Navigation
Post A Comment: