- దళిత బిడ్డల గోడును గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్.
- ఎస్సీ సెల్ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్
- చొప్పాల గ్రామపంచాయతిలో ఎస్సీ విభాగం కమిటీ ఎన్నిక
మన్యం న్యూస్, కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేనకబడిన కులాలను(ఎస్సీ) లను గుర్తించి కులాలకు అతీతంగా సముచిత స్థానం కల్పించిన మహనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పినపాక నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న.అశోక్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని చొప్పాల గ్రామపంచాయతిలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్టా.ఏడుకొండలు ఆధ్వర్యంలో ఎస్సీ ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గ అధ్యక్షులు వెన్న.అశోక్ కుమార్ పాల్గొని నూతనంగా ఎస్సీ కమిటీని ఎన్నుకున్నారు.గ్రామపంచాయతి అధ్యక్షులు గా కొండగోర్ల. కోటేశ్వరరావు,ఉపాధ్యక్షుడిగా బోడ.నాగేశ్వరరావు, మిగత కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.అనంతరం వెన్న అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్ అన్నారు.దేశంలో దళితుల సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని,దళితుల బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి దళితుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్ వెంటనే దళితుల ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జవ్వాజి.రాధ,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, ఎంపిటీసి కొమరం.మునీంద్రా, ఉప సర్పంచ్ బోడ.ప్రశాంత్,టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తడికమళ్ళ.ప్రభుదాసు,బోడ.ఈశ్వర్ ,పాయం.రాజబాబు, గుడ్ల.రంజీత్, చిట్టిమల్ల.ప్రవీణ్, నిట్టా .ప్రభాకర్,రామటెంకి. పూర్ణ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: