మన్యం న్యూస్ అక్టోబర్ 22 వాజేడు:
వాజేడు మండలంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల పెద్ద గొల్లగూడెం లో ఆదివాసి ముద్దుబిడ్డ పోరాటయోధుడు, గోండు బెబ్బులి కొమరం భీమ్ జయంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, సమక్షంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విగ్నేశ్వర రావు, మాట్లాడుతూ కొమరం భీం యొక్క పోరాటాన్ని ఆయన జీవిత గాధలను ఆదివాసీల విద్యార్థులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. కొమరం భీమ్ భూమి కోసం ,భుక్తి కోసం, నిజాం ప్రభుత్వ పాలన నుండి విముక్తి కోసం పోరాటం చేశారని ఆయన అన్నారు. కొమరం భీమ్ పోరాటాన్ని ఆదివాసి విద్యార్థులు స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని,కొమరం భీం ఆశయ సాధన కొరకు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, ఉపాధ్యాయులు కేశవ రావు, పాయం నాగేశ్వరరావు, పి బుచ్చిబాబు, పి స్వప్, డిప్యూటీ వార్డెన్ సి హెచ్ ప్రసాద్, వై కవిత, ఏం యశోద, పాఠశాల విద్యార్థిలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: