సారపాక, అక్టోబర్ 22, మన్యం న్యూస్:
బూర్గంపాడు మండల తెరాసా యువజన విభాగం ఇంచార్జ్ గా మణుగూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు హర్ష నాయుడు నియమితులైనారు. శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతరావు బూర్గంపాడు మండల తెరాసా యువజన విభాగం ఇంచార్జ్ గా హర్ష నాయుడును ప్రకటించారు. ఈ సందర్భంగా హర్ష నాయుడు మాట్లాడుతూ... నా పై నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతరావుకు, సహకరించిన పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: