మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ పాల్గొని మాట్లాడుతూ, ఆదివాసీలందరూ కొమరం భీమ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, కొమరం భీం ఆదివాసుల జాతిపిత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఆదివాసీ సంఘాల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: