భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP Dr.వినీత్ జి గారి ఆదేశాల మేరకు ,పాల్వంచ DSP టి.సత్యనారాయణ గారి పర్యవేక్షణలో
పాల్వంచ పట్టణం లో నిన్న సాయంత్రం GCC గోదాము వద్ద భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వాహన తనిఖి చేస్తుండగా ఒక స్కోడా కార్ నందు డిక్కీలో 5 గంజాయి సంచులతో పట్టుబడినాడు అతని వద్ద నుండి 116 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొనయినది.విచారణ లో ఒరిస్సా నుండి గంజాయి ని కొనుక్కుని వస్తున్నాడు అని తెలిపాడు.వాహన తనిఖీలో పాల్వంచ టౌన్ SI K.నరేష్ గారు, SI G. ప్రవీణ్ కుమార్ గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టు బడిన వ్యక్తి వివరాలు
దారవత్. వంశీ నాయక్ s/o లింగయ్య ,27 yrs, కార్ డ్రైవర్, పండు నాయక్ తండా, దూరాజ్ పల్లి గ్రామము చివ్వేంల మండలం, సూర్యాపేట జిల్లా.
స్వాధీనం చేసుకున్న వివరాలు.
1)116 kg ల గంజాయి,
దీని విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉండును.
2)ఒక స్కోడా కార్
3) ఒక సెల్ ఫోన్
లను సీజ్ చేయడం జరిగింది.
నిందితుడిని పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ M.నాగరాజు గారు అరెస్టు చేసి రిమాండ్ కి పంపి కేస్ దర్యాప్తు చేయనైనది, ముఖ్యంగా యువత గంజాయి కి ప్రభావితం అవుతున్నారు గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ వారికి సమాచారం ఇచ్చి సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని CI M. నాగరాజు తెలిపారు.
Post A Comment: