మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25.... వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి సుమారు 15 మేక పిల్లలను హతమార్చిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం బైపాస్ రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. మేతకు వచ్చిన 15 మేకపిల్లల పైన వీధి కుక్కలు విచక్షణ రహితంగా కరవటంతో 15 మేకపిల్లలు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చుంచుపల్లి మండల పరిధిలో వీధి కుక్కల సైర్వ విహారం చేస్తున్నాయి . రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజల్ని మేకపిల్లను సైతం కుక్కలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. పాదచారులకు ద్విచక్ర వాహన దారుల ను సైతం కుక్కలు వదలడం లేదు. కుక్కల బెడద వలన ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరుకోవాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా చుంచుపల్లి మండలంలోని వీధి కుక్కలను నివారించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కుక్కలను నివారించేందుకు చర్యలు చేపట్టకపోవడం పైన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కనీసం ఇప్పటికైనా వీధి కుక్కల బారి నుంచి అధికారులు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Navigation
Post A Comment: