మన్యం న్యూస్, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం, గోపాలరావుపేట గ్రామాలకు చెందిన భాధిత కుటుంబాలకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఏడూళ్లబయ్యారం - పడిగెల శ్రీను - 12000 జి. సోమయ్య- 38,500 చొప్పున పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్, ఎంపీటీసీ సిహెచ్ సత్యం, రైతుబంధు మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ కోరం రజిని, సొసైటీ డైరెక్టర్ కటకం గణేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు కరుకూరి తిరపతి, బూర రమేష్, మండల నాయకులు సోంపల్లి తిరుపతి, కంది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: