మన్యం మనుగడ, అక్టోబర్ 5, వాజేడు :
జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాజేడు నాగారం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.బుధవారం నాడు రామచంద్రపురం వర్సెస్, వెంకటాపురం హోరా హోరి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో, రామచంద్రపురం టీమ్ విజయం సాధించింది. స్థానిక సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, చేతులమీదుగా మొదటి బహుమతి అందించారు. ద్వితీయ బహుమతి వెంకటాపురం టీమ్ కైవసం చేసుకుంది. తృతీయ బహుమతి పేరూరు టీం కైవసం చేసుకుంది.ఈ కార్యక్రమంలో విక్రాంత్, వాజేడు నాగారం యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: