మన్యం న్యూస్: గుండాల/ఆళ్లపల్లి (04) సద్దుల బతుకమ్మ వేడుకల్లో టిఆర్ఎస్ నేతలు సందడిగా గడిపారు మండలం పరిధిలోని మర్కోడు పంచాయతీ పరిధిలోగల జిన్నెలగూడెం గ్రామంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా గ్రామంలోని మహిళలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, జడ్పిటిసి హనుమంతరావు, పిఎసిహెచ్ చైర్మన్ రామయ్య, సర్పంచ్ శంకర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతామని నేతలు పేర్కొన్నారు
Navigation
Post A Comment: