CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దుర్గాదేవి నవరాత్రులు "విజయదశమి" సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Share it:


మన్యం న్యూస్ : జూలూరుపాడు, (అక్టోబర్ 5) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అమ్మవారి దేవీ నవరాత్రులు, "విజయదశమి" పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలం పరిధిలోని పాపకొల్లు గ్రామంలో వెలసియున్న శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల ప్రజలంతా తాము చేపట్టిన పనులలో విజయం సాధించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరికి శుభం కలగాలని దుర్గామాతను వేడుకొన్నారు. అదే విధంగా మండల ప్రజలందరికీ విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిశెట్టి రాంబాబు, శ్రీనాథా నాగరాజు, ఎస్.కె సుభాని, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, నర్వినేని పుల్లారావు, మోదుగు రామకృష్ణ, కొదుమూరి కోటేశ్వరరావు, ధర్మరాజుల సత్యనారాయణ, ధర్మరాజుల వెంకటనారాయణ, భూక్య సక్రు నాయక్, కడియాల పుల్లయ్య, యాసా నాగరాజు,  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: