మన్యం న్యూస్, కరకగూడెం: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరకగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపద ఉందంటే ఆపద్బాంధవుడులా ఆదుకునే గొప్ప వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని వారన్నారు. వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం తమకు చాలా ఆనందంగా ఉందని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు అందించి,రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అనంతారం ఉపసర్పంచ్ అత్తె. సత్యనారాయణ ,ఎర్ర సురేష్ ,బిజ్జ రామనాథం, జలగం.కృష్ణ, గొగ్గలి. రవి, గడ్డం. రాజేష్,మోడేపు సాంబయ్య భూక్య. రామదాసు,పునెం శంకర్, షేక్ ఇలియాజ్ తులం రామారావు,ఆవుల.లింగయ్య, పడిగ.సమ్మయ్య,నిట్ట.సత్యం తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: