* మన్య మనుగడ సంచిక, మన్యం న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ ని లక్షలాదిమంది పాఠకుల, వ్యూవర్స్ అభిమానం పొందడం అభినందనీయం
* మన్యం న్యూస్ డిజిటల్ పత్రిక విశ్లేషణాత్మక కథనాలు అందించాలి
* పారదర్శకత కోసం మన్యం న్యూస్ టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో ప్రారంభం
* మన్యం న్యూస్ డిజిటల్ పేపర్ కరపత్రాలు ఆవిష్కరించిన మన్యం న్యూస్ ఎండీ, తెలంగాణ రాష్ట్ర విప్& పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు.
#మణుగూరు
నిష్పక్షపాతమైన వార్తలు అందించడంలో మన్యం న్యూస్ డిజిటల్ డైలీ ముందుండాలి అని మన్యం మీడియా గ్రూపు సంస్థ ల ఎండీ,విప్ ,పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు అన్నారు. శుక్రవారం మణుగూరు క్యాంపు కార్యాలయం లో త్వరలో వెలువడనున్న మన్యం డిజిటల్ పేపర్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన్యం మీడియా రాణించడం అభినందనీయమని, ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ఏజెన్సీ మాసపత్రిక మన్యం మనుగడ ముద్రణ విషయంలో క్వాలిటీ విషయం రాజీ లేకుండా పాఠకులకు అందించడం జరిగిందన్నారు. ఏజెన్సీ సమస్యలు నిర్భయంగా సేకరించి పాలకుల దృష్టి కి తీసుకవెళ్లిన మన్యం విలేకరుల కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మన్యం యూనిట్ సిబ్బందిని, జిల్లా ఇన్చార్జి నియోజకవర్గ ఇన్చార్జిలను, విలేకరులను అభినందించారు. అలాగే మన్యం న్యూస్ డాట్ కామ్ ని ఇప్పటివరకు 17 లక్షల పైచిలుకు పాఠకులు వీక్షించడం జరిగిందన్నారు. వీటి ప్రేరణతో మరో ముందడుగు వేస్తూ మన్యం న్యూస్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. వేడివేడి వార్తలు ఎప్పటికప్పుడు పాఠకులకు అందించాలని ఉద్దేశంతో మన్యం న్యూస్ డిజిటల్ పేపర్ తీసుకురావడం జరిగిందన్నారు. పారదర్శకత కోసం మన్యం న్యూస్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. తమ సిబ్బంది ఎలాంటి అవకతవకలకు, వేధింపులకు పాల్పడిన టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: