మన్యం న్యూస్ ప్రతినిధి , చండ్రుగొండ , అక్టోబర్ 21 : మండల పరిధిలోని సీతయిగూడెం గ్రామంలో పోడుభూముల సర్వే కొనసాగించాలని 150 మంది ఎంపీడీవో అన్నపూర్ణ,డిప్యూటీ తహసిల్దార్ ప్రసన్న,మండల ప్రత్యేక అధికారి సంజీవరావులకు శుక్రవారం వినతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా పోడుదారులు మాట్లాడుతూ...గ్రామంలో కొద్దిమంది పోడుదారులను అడ్డుపెట్టుకొని ప్లాంటేషన్ భూములను సర్వే చేస్తేనే మిగతా భూములకు పోడు భూములను సర్వే చేయాలని, పోడు సర్వేను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోడు కమిటీలో కొంతమందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోడుదారులను రెచ్చగొడుతూ పోడు సర్వేను అడ్డుకోవడం సరికాదన్నారు. మా గ్రామంలో అధికారులు స్వచ్ఛందంగా సర్వే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉపసర్పంచ్ బొర్ర కేశవులు, మాజీ సర్పంచ్ పాండ్ల అంజన్ రావు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్య నాయక్, మండల నాయకులు బన్నె నాగరాజు, పోడుదారులు రవి, రాములు,రాంబాబు,పుల్లారావు,బుచ్చయ్య,జోగయ్య, అన్నపూర్ణ, లలిత,గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: