CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి.. నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం, అక్టోబర్ 29::

ప్రతి కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ గెలిపి లక్ష్యంగా పనిచేయాలని అలానే గ్రామ అధ్యక్షులు యువత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని లక్ష్మీనగరం గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పట్టణ కార్యదర్శి డింగి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భద్రాచలం నియోజవర్గంలో మన ప్రాతినిధ్యం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని రానున్న ఎన్నికల్లో ఎలాగైనా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా ప్రతి కార్యకర్త ఇప్పటినుంచే ప్రణాళిక రచించి ముందుకు సాగాలని అలానే గ్రామ అధ్యక్షులు యూత్ సభ్యులకు  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేయాలని తెలియజేశారు రానున్న భవిష్యత్తు ఎన్నికల్లో భద్రాచలం నియోజవర్గం బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని అన్నారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే  సత్యనారాయణమూర్తి, కార్యదర్శి కనితి రాముడు, ఎంపీపీ రేసు లక్ష్మి, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, ఎంపీటీసీ  వనజ, రామారావు, సర్పంచ్ సోడి జ్యోతి, యూత్ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, రైతు నాయకులు రాము, శ్రీధర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: