- మండల వ్యాప్తంగా నాగులచవితి వేడుకలు.
- నాగులచవితి వేడుక సందర్భంగా పుట్టలో పాలు పోసిన ఎంపీపీ రేగా కాళికా, సత్యనారాయణ దంపతులు
మన్యం న్యూస్ కరకగూడెం: మండలంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు జరిగాయి. నాగుల చవితి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పుణ్యస్నానాలు ఆచరించి సూర్యోదయం నాటికి మండల వ్యాప్తంగా రాళ్లవాగు పెద్దమ్మ తల్లి గుడి,గట్టు నరసింహ స్వామి దేవాలయం,చొప్పాల గ్రామంలో సాలమ్మ గుడి గుట్ట వద్ద భక్తులు పుట్టలో పాలు పోసి భక్తిని సాటుకున్నారు. కరకగూడెం మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామపంచాయతీ గల రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయ సన్నిధిలో ఉన్న పుట్టలో ఎంపీపీ రేగా.కాళికా, సత్యనారాయణ దంపతులు పుట్టలో పాలు పోసి నాగులమ్మ తల్లికి తమ మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు ప్రసాదాలతో నాగదేవతకు పాలు పండ్లు ప్రసాదంగా అందించడం ఆనవాయితీగా వస్తుందని తమ పూర్వీకుల నుండి వచ్చే ఆనవాయితీని తూచా తప్పకుండా పాటిస్తామని అన్నారు.మండల వ్యాప్తంగా భక్తులు తమ మొక్కలు చెల్లించుకున్నారని నాగులమ్మ దీవెనతో మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి జీవించాలని ఆమె నాగులమ్మ తల్లిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: