మన్యం న్యూస్ గుండాల/ఆళ్లపల్లి అక్టోబర్ (30) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని నందాయని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, యువజన విభాగం అధ్యక్షులు కొమరం సతీష్ అన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం ఆదివారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలను దోచుకుంటూ వెళుతూ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014 ముందు బేరర్ ధర ఎక్కువగా ఉన్న దేశంలో ఇంధనం రేట్లు తక్కువగా ఉండేవని తగ్గిన ఇంధనం ధరలను అధిక మొత్తంలో పెంచి దేశ ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం 100 సంవత్సరాలు వెనకకు వెళ్ళిందే తప్ప ప్రగతి సాధించింది ఏమీ లేదన్నారు. మరో మారు బిజెపి ప్రభుత్వం దేశంలో వస్తే సామాన్యుడు బతకటం మీద కూడా పన్నులు వేస్తారని అన్నారు. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామయ్య,ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బాబా, సోషల్ మీడియా అధ్యక్షులు సందీప్ ,యువజన విభాగం నాయకులు ఆరిఫ్, ఆదామ్, సర్వేష్ , భాస్కర్, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: