మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మద్దులగూడెం గ్రామంలో పున్నం బుచ్చమ్మ అనే వృద్ధురాలు శనివారం మరణించడం జరిగింది.
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ కొర్స లక్ష్మీ రూపవతి, ఉపసర్పంచ్ పొనుగంటి వెంకటేశ్వర్లు ల చేతుల మీదుగా దహన సంస్కారాలు నిమిత్తం 3500 రూపాయలను ఆర్థిక సాయం గా అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్లకొండ శ్రీను, బెల్లంకొండ చిన్నారి, వడ్లకొండ సమ్మయ్య, బొంపల్లి కిషోర్, వార్డ్ మెంబర్స్ పాల్గొన్నారు.
Post A Comment: