మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం విద్యుత్ శాఖ ఏఈ గా అనుమోలు కావ్య నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఏఈ రవీందర్ బదిలీపై వెళ్లడంతో, ఇటీవల వెలువడిన టి ఎస్ పి ఎస్ సి ఫలితాలలో స్థానం పొందిన కావ్యను, శిక్షణ అనంతరం ఏడూళ్ళ బయ్యారం శాఖకు కేటాయించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా రైతులకు వ్యవసాయం పరంగా అన్నివేళలా విద్యుత్ సరఫరా చేస్తామని, ప్రజలందరూ సహకరించాలని, సమస్యలు ఏమైనా ఉంటే ప్రత్యక్షంగా తన వద్దకు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: