CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతి ఆత్మగౌరవమే జాతీయ మాలమానాడు లక్ష్యం

Share it:

 


- జాతి ఆత్మగౌరవమే జాతీయ మాలమానాడు లక్ష్యం

- 18న ఓరుగల్లులో మాలల సత్తా చాటాలి... 

- జాతీయ మాల మానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు  పిల్లి రవి వర్మ.


బూర్గంపాడు మన్యం న్యూస్ అక్టోబర్ 27:

జాతి ఆత్మగౌరమే జాతీయ మాల మహానాడు లక్ష్యమని జాతీయ మాలమానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవి వర్మ అన్నారు. గురువారం  మండలంలోని కృష్ణ సాగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమాహనాడు 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంఘ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పిల్లి రవి  మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ఓట్లు దండుకునేందుకు కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే దళితులను విచ్ఛిన్నం చేసేందుకు ఎస్సీ వర్గీకరణను తెరమీదకు తీసుకు వస్తుందని మండిపడ్డారు. మాల ఆత్మగౌరవాన్ని, సత్తాను చాటేందుకు డిసెంబర్ 18న ఓరుగల్లు వేదిక గా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ సభను విజయవంతం చేసేందుకు వేలాదిగా ప్రతి ఇంటి నుండి మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 

.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు సీనియర్ నాయకులు ఎడ్ల ఉప్పలయ్య, తాటి రవి, పొన్నల నారాయణ, పూడ రమేష్, బద్రి ,యశ్వంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: