CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. 👉 అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జ్యోతి

Share it:


మన్యం న్యూస్:ములకలపల్లి:(అక్టోంబర్ 27)

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జ్యోతి  పిలుపునిచ్చారు.మండల కేంద్రంలో జరిగిన సంఘం మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, రోజు,రోజుకీ మహిళలపై దాడులు ఎక్కువై పోతావుంటే ప్రభుత్వం చేష్టలుడిగి  చూస్తుందని అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైపోయిందని,మహిళల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ద చూపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని,హైదరాబాదులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ముక్కు పచ్చలారని బాలికపై అత్యాచారం ఘటన పై దిష్టి బొమ్మ దగ్ధం చేసి కామాంధులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు  అనసూయ అమల, పద్మావతి, గౌరి లక్ష్మి, దస్మా, జ్యోతి, విమల, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: