మన్యం న్యూస్, ములకలపల్లి, అక్టోంబర్ 27:
మండలంలోని సీతారాంపురం గ్రామ పంచాయతీ,గుర్రాలగుంట గిరిజన గ్రామస్తులు తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ కి గత 20 సంవత్సరాలు నుంచి సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని , చింతలపాడు గ్రామం నుంచి గుర్రాల కుంట గ్రామం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదని వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా చింతలపాడు నుంచి గుర్రాలకుంట వరకు రోడ్డు కోసం సంబంధించిన శాఖ అధికారులను పంపించి గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని కలెక్టర్ తెలియజేసారు. గుర్రాల కుంట పోడు భూములు సాగుదారులు సమస్యనులపై జిల్లా కలెక్టర్ శానుకూలంగా స్పందించారని జెడ్పిటిసి సున్నం నాగమణి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి అంజుమ్ , గుర్రం జయసుధ ,గుర్రం కృష్ణమూర్తి, తాటి తిరుపతయ్య ,తాటి జానకమ్మ తాటి రాజమ్మ, పూ నెం బాబురావు, కోడె రాజమ్మ , బొ ర్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: