CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వ ప్రలోభాలను నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

Share it:

 


జూలూరుపాడు, అక్టోబర్ 27, (మన్యం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపులో భాగంగా, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశానుసారం, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలతో ప్రలోభ పెడుతుండడాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ  కుట్రలను వ్యతిరేకిస్తూ మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సోని, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకట రెడ్డి, యల్లంకి సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళపల్లి వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, సర్పంచ్ లావుడియా కిషన్ లాల్, ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదనరావు, పెండ్యాల రాజశేఖర్, మోదుగు రామకృష్ణ, రామీ శెట్టి రాంబాబు, దొండపాటి వాసు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బానోత్ ధర్మ, చాపలమడుగు రామ్మూర్తి, ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్, తోట శీను, ఎల్లంకి పుల్లయ్య, మాచినేని సత్యం, రామి శెట్టి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: