- మేము సాగు చేసుకునే భూములు రెవిన్యూ భూములు
-ఇవి ఫారెస్ట్ భూములు మాత్రం కాదు దీనిపై 76 రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి
-ఫారెస్ట్ సర్వే ని అడ్డుకొని ధర్నా నిర్వహించిన వేదాంతపురం సర్పంచ్ సోమిని శివప్రసాద్
మన్యం న్యూస్, అశ్వారావుపేట: తెలంగాణ ప్రభుత్వం పోడు సాగుదారులకు పోడు పట్టాలు ఇవ్వటం జరుగుతుందినీ ప్రస్తుతం అటవీ క్షేత్ర అధికారులు భూములు సర్వే నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది ఇలా ఉండగా అశ్వరావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో మంగళవారం సర్పంచ్ సోమిని శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆ గ్రామం 76 మంది రైతు కుటుంబాలు సర్వేను అడ్డుకొని గ్రామంలో టెంటు వేసుకొని వారి డిమాండ్స్ తో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమిని శివప్రసాద్ మాట్లాడుతూ వారి గ్రామం దగ్గర రెవెన్యూ ల్యాండ్ 172 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. దానిలో వారి గ్రామం 76మంది రైతులు తలా ఎకరం 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం పేరుతో ఫారెస్ట్ అధికారులు సర్వేకు వచ్చి ఫారెస్ట్ పట్టాలు ఇస్తామని అనడంతో మాది రెవిన్యూ భూమి అని వారికి తెలియజేసే సర్వేని అడ్డుకున్నామని అన్నారు. మాభూమి మాకే కావాలని మాది రెవిన్యూ భూమి కాబట్టి రెవిన్యూ పట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా మా గ్రామంలో రెవెన్యూ భూమి ఎంతవరకు ఉందని సర్వే కూడా నిర్వహించడం జరిగిందని సర్వే నిర్వహించి ఫైనల్ రిపోర్టు కూడా రావలసి ఉండగా ఇప్పుడు ఫారెస్ట్ సర్వే చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత సంవత్సరంలో వారి గ్రామంలో జరిగిన ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించిన ఇప్పటికీ ఫైనల్ రిపోర్ట్ రాలేదని ఫైనల్ రిపోర్టు త్వరగా రావాలని అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. రెవిన్యూ ఎంతవరకు ఉందో అది అంతా మా గ్రామ అవసరాలకు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ యొక్క డిమాండ్స్ నెరవేరకపోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని, సమస్య పరిష్కారం కాని పట్ల కలెక్టరేట్ నుండి ప్రగతి భవనం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని మా గ్రామ రైతులందరూ నిశ్చయించుకుని ఉన్నామని సర్పంచ్ సోమని శివప్రసాద్ తెలిపారు.
Post A Comment: