మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో నాగుల చవితిని పురస్కరించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో పుట్టల వద్దకు చేరుకొని పూజలు చేశారు. ఉదయాన్నే స్నానాధులు ఆచరించి, పూజకు కావాల్సిన సామాగ్రిని చేత పట్టుకుని, ఉపవాసం ఆచరిస్తూ దగ్గరలోని నాగేంద్ర స్వామి నెలకొని ఉన్న ఆలయాల వద్దకు, పుట్టల వద్దకు చేరుకొని స్వామివారికి పలహారాలు, పాలు సమర్పించి తమ కోరికలను నెరవేర్చమని, పొలాల దగ్గరకు వెళ్లే రైతులకు ఎటువంటి హాని తల పెట్టకుండా ఉండమని దైవాన్ని తలుచుకొని పూజలు చేశారు.
Post A Comment: