CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించాలి...

Share it:


మన్యం న్యూస్, చండ్రుగొండ ,  అక్టోబర్ 29 : గ్రామాల్లో ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించాలని అణగారిన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు అన్నారు. శనివారం రావికంపాడు రైతువేదిక భవనంలో జరిగిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మా సంఘం ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. పోడుదారులకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలన్నారు. గిరిజన పూజారులకు సైతం ధూప దీప నైవేద్యం పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ  పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఫయాజ్, హ్యూమన్ రైట్స్ కమిషన్ బాధ్యులు ఉన్న జ్ఞాన సుందరి, సోషల్ మీడియా ఆక్టివిటీ సభ్యులు  కొప్పుల నాగమణి, ఖమ్మం జిల్లా దిశా  కమిటీ ఉపాధ్యక్షులు కోడెం సీతాకుమారి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: